తెలంగాణలో ఐటీ దాడుల కలకలం.. నాలుగు ఇన్‌ఫ్రా కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు

Siva Kodati |  
Published : Mar 23, 2022, 07:22 PM IST
తెలంగాణలో ఐటీ దాడుల కలకలం.. నాలుగు ఇన్‌ఫ్రా కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు

సారాంశం

తెలంగాణలో ఐటీ దాడులు (it raids) కలకలం రేపాయి. రాష్ట్రంలోని నాలుగు ఇన్‌ఫ్రా కంపెనీలలో (infra companies) బుధవారం ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాక్స్ కట్టని ఆదాయానికి సంబంధించి పలు వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణలోని నాలుగు ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. కేఎన్ఆర్ ఇన్‌ఫ్రా (knr infra), గజా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (gaja engineering) , ఆర్‌వీఆర్ (Rvr) , జీవీపీఆర్ కంపెనీల్లో (gvpr) తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో రూ.150 కోట్ల లావాదేవీలకు ట్యాక్స్ కట్టలేదని కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అంగీకరించింది. ఈ కంపెనీకి నర్సింహారెడ్డి, జలంధర్ రెడ్డిలు ఛైర్మన్‌లుగా వుంటున్నారు. అటు రూ.50 కోట్ల లావాదేవీలకు సంబంధించి ట్యాక్స్ కట్టలేదని అంగీకరించింది గజా ఇంజనీరింగ్ సంస్ధ. మరోవైపు ఆర్‌వీఆర్ సంస్థ రూ.60 కోట్లు ట్యాక్స్ కట్టలేదని ఐటీ అధికారుల ముందు అంగీకరించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..