దోపిడికి అడ్డొస్తే చంపేయడమే: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Siva Kodati |  
Published : Aug 29, 2020, 05:34 PM IST
దోపిడికి అడ్డొస్తే చంపేయడమే: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

సారాంశం

10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు.

10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు.

వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. గతంలోనే వీరిపై పలు కేసులు నమోదయ్యాయని.. తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా వీరంతా జగద్గిరిగుట్ట అంబేద్కర్ కాలనీలో షెల్టర్ తీసుకున్నారని సజ్జనార్ చెప్పారు.

ముందుగా చోరీకి పాల్పడే ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తారని, నేరాలు చేసే సమయంలో ఆయుధాలు ఉపయోగిస్తారని సీపీ పేర్కొన్నారు. చోరీ సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారిని చంపేందుకైనా వెనుకాడరని సజ్జనార్ వెల్లడించారు. వీరిపై ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీరి నేరాలపై ఇంకా విచారించాల్సి వుందని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu