
హైదరాబాద్ : సినిమాలు, ఓటీటీ ఫ్లాట్ ఫాంలలో వెల్లువెత్తుతున్న క్రైం ఎంతోమందిని నేరస్తులుగా మారుస్తోంది. నేరస్తులకు కొత్త కొత్త ఐడియాలను ఇస్తోంది. ఇటీవలి కాలంలో వీటి స్ఫూర్తితో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అమ్మాయిలతో మాట్లాడాలనుకునే Young people, studentsను మాయమాటలతో ఆకర్షించి... ఫలానా ప్రాంతానికి రావాలని kidnap చేసి... డబ్బులు లాక్కుని వదిలేస్తున్న ముఠాను అసిఫ్ నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠా నాయకుడు గుంజపోగు సురేష్ సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్వాల్ CV Anand విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏడాదిగా వీరు ఆరుగురిని అపహరించారు. పది రోజుల క్రితం గుడిమల్కాపూర్ లో ప్రశాంత్ అనే యువకుడిని కిడ్నాప్ చేసినట్లు అతని సోదరి ఫిర్యాదు చేయగా... కేసు దర్యాప్తులో వారి నేరాలు వెలుగుచూశాయని పశ్చిమ మండలం డిసిపి జోయల్ డేవిస్ వివరించారు.
ఉద్యోగులు నియమించుకుని…
అత్తాపూర్ లో ఉంటున్న సురేష్ (27) చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రెండేళ్ల క్రితం బయటకు వచ్చాడు. విభిన్నంగా నేరాలు చేయాలనే లక్ష్యంతో Netflix లో అతను చూసిన Money Heist వెబ్ సిరీస్ స్ఫూర్తితో కిడ్నాప్ లు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం గతేడాది జనవరిలో మెహిదీపట్నంలోని బోజగుట్ట లో నివాసం ఉంటున్న రోహిత్, ఇందూరి జగదీష్, kunalలను ఉద్యోగులుగా నియమించుకున్నాడు. యువకులు, విద్యార్థుల ఫోన్ నెంబర్లు సేకరించాడు. వారితో మాట్లాడేందుకు జగద్గిరిగుట్ట లో నివాసముంటున్న శ్వేతాచారిని ఒప్పించాడు. కిడ్నాప్ చేసేందుకు సెకండ్ హ్యాండ్ కార్ కొని అపహరణను ప్రారంభించాడు.
ఒకటి, రెండు రోజులు బాధితులతో శ్వేతాచారి తో వాట్సాప్ లో మాట్లాడించాక ఫలానా ప్రాంతానికి రావాలంటూ ఫోన్ లో చెప్పేవారు. బాధితులు రాగానే అప్పటికే కారులో ఉన్న రోహిత్, కునాల్ అతడిని కారులో ఎక్కించుకుంటారు. ఇక అప్పుడు అతడిని బెదిరించిన అతని కుటుంబ సభ్యులకు డబ్బు కోసం ఫోన్ చేయిస్తారు.. తాము అడిగిన డబ్బు ఇవ్వలేదంటే చంపేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తారు. అతడి డెబిట్ కార్డులో నగదు వేయించి సమీపంలోని ఏటీఎం కేంద్రానికి తీసుకెళ్లి విత్ డ్రా చేసుకుంటారు.
డబ్బు తీసుకోవడం కూడా కొత్త పద్ధతుల్లో తీసుకునేవారు. ప్రశాంత్ ను కిడ్నాప్ చేసిన సురేష్ ముఠా. కుటుంబీకులను డబ్బు తీసుకుని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలోని ఓ వంతెన వద్దకు రమ్మన్నారు. అక్కడ కారులో కిడ్నాపర్లు ఉండగా... ప్రశాంత్ సోదరులు తెచ్చిన రూ.50,000 తాడుకు కట్టి వంతెనపై నుంచి కిందికి వేయించి తీసుకున్నారు.
పోలీస్.. పవన్ కళ్యాణ్ టాటూలు...
కారును ఎంతో చాకచక్యంగా, వేగంగా నడిపే సురేష్ వ్యవహారశైలి విచిత్రంగా ఉందని పోలీసులు తెలిపారు. ఒక చేతికి పోలీస్.. మరో చేతికి పవన్కళ్యాణ్ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. విలాసవంతంగా జీవించాలని, కారుల్లో తిరగాలని సురేష్ ఆశ. అందుకే గదిలో కాకుండా కారులోనే పడుకుంటాడు అని వివరించారు. ఆసిఫ్ నగర్ పోలీసులు అతడు కారులో పడుకున్నప్పుడు చుట్టూ ఐదు డీసిఎంలను పెట్టి అదుపులోకి తీసుకున్నారు.