గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసినట్టుగా నిందితుడు సంజయ్ కుమార్ కోర్టులో ఒప్పుకొన్నాడు. ఈ కేసులో తుది తీర్పు బుధవారం నాడు ఇవ్వనుంది. దీంతో నిందితుడిని పోలీసులు వరంగల్ కోర్టులో హాజరుపర్చారు.
వరంగల్: గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసినట్టుగా నిందితుడు సంజయ్ కుమార్ కోర్టులో ఒప్పుకొన్నాడు. ఈ కేసులో తుది తీర్పు బుధవారం నాడు ఇవ్వనుంది. దీంతో నిందితుడిని పోలీసులు వరంగల్ కోర్టులో హాజరుపర్చారు.
also read:వరంగల్ గొర్రెకుంటలో 9 హత్యలు: నేడు కోర్టు తీర్పు
ఈ ఏడాది మే 21వ తేదీన గొర్రెకుంటలో ఆలం కుటుంబానికి చెందిన సభ్యులు ఏడుగురు, బీహార్ కు చెందిన శ్యాం, శ్రీరామ్ లు మరణించారు. వీరిని సంజయ్ కుమార్ దారుణంగా హత్య చేశాడు. గొర్రెకుంట బావిలో వేశాడు.
ఈ కేసులో నిందితుడిగా సంజయ్ కుమార్ ను 72 గంటల్లో గుర్తించారు. నిందితుడిపై చార్జీషీటు దాఖలు చేశారు. ఈ కేసుపై ఇవాళ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. నిందితుడు సంజయ్ కు ఉరిశిక్ష పడాలని వాదించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయితే ఈ హత్యలు చేసినట్టుగా జడ్జి ముందు నిందితుడు సంజయ్ కుమార్ ఒప్పుకొన్నాడు.ఈ కేసులో నిందితుడిపై అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో నిరూపించాడు. నేరం రుజువైందని జిల్లా కోర్టు ప్రకటించింది.