Telangana: వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల గుడ్ న్యూస్... చలాన్ల చెల్లింపులో డిస్కౌంట్ !

Published : Feb 18, 2022, 03:27 PM IST
Telangana: వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల గుడ్ న్యూస్... చలాన్ల చెల్లింపులో డిస్కౌంట్ !

సారాంశం

Telangana: ట్రాఫిక్ జ‌రిమానాలు ఎదుర్కొంటున్న వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు ట్రాఫిక్ చ‌లాన్లు పూర్తిగా చెల్లించ‌ని వారికి జారిమానాల్లో రాయితీలు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. క‌రోనా నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు.   

Telangana: క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసుకోగా.. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. ఉపాధి కోల్పోయి ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా వైరస్ ప్ర‌భావం ఇంకా కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ట్రాఫిక్ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ట్రాఫిక్ జ‌రిమానాలు (fines) ఎదుర్కొంటున్న వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు ట్రాఫిక్ చ‌లాన్లు పూర్తిగా చెల్లించ‌ని వారికి జారిమానాల్లో రాయితీలు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. క‌రోనా నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. 

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలోనే.. 

ట్రాఫిక్ చ‌లాన్ల విష‌యం గురించి హైద‌రాబాద్ (Hyderabad) ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాథ్  మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ మహమ్మారి చాలా మందిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని తెలిపారు. అయితే, ట్రాఫిక్ ఆంక్ష‌లను ఉల్లంఘించిన వాహ‌న‌దారుల‌కు విధించిన‌ జరిమానాలలో తగ్గింపును అందించడం ద్వారా వారిపై ఉన్న ఆర్థిక‌ భారాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతున్న‌ద‌ని తెలిపారు. 

ఇంకా చెల్లించ‌ని చ‌లాన్లు రూ.600 కోట్ల‌కు పైనే.. 

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో ట్రాఫిక్ ఉల్లంఘ‌ట‌న‌లు అధికంగానే ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు హైదరాబాద్‌లో చెల్లించని చలాన్‌లు రూ. 600 కోట్లు  ఉన్నాయ‌ని హైద‌రాబాద్ ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాథ్ (A V Ranganath) తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు చ‌లాన్‌లు చెల్లించ‌ని వారికి కొంత ఊర‌ట క‌ల్పించేందుకు కృషి చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. 

ప్ర‌మాదాలు త‌గ్గించాల‌నే ల‌క్ష్యంతోనే ట్రాఫిక్ చ‌లాన్లు.. 

ప్ర‌మాదాల‌ను త‌గ్గించాల‌నే ల‌క్ష్యంతోనే ట్రాఫిక్ చ‌లాన్లు విధిస్తున్నామ‌ని హైద‌రాబాద్ ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. అలాగే, ట్రాఫిక్ చ‌లాన్ల డిస్కౌంట్ పై పూర్తి విధానాలు ఇంకా పూర్తి కాలేద‌ని పేర్కొన్న ఆయ‌న దీనిపై క‌స‌ర‌త్తు కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. గ‌త నాలుగైదు సంవ‌త్స‌రాల్లో ప్ర‌మాద డేటాను విశ్లేషించే అధ్య‌య‌నం ప్ర‌స్తుతం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఈ విశ్లేష‌ణ అధ్య‌య‌నం ఆధారంగా హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్ర‌మాదాలు, అతివేగం, మ‌ద్య సేవించి వాహ‌నాలు న‌డ‌ప‌డం వంటి వాటిని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తార‌ని తెలిపారు. 

రాత్రి స‌మ‌యాల్లోనే ప్ర‌మాదాలు ఎక్కువ‌.. 

కాగా, గ‌త నాలుగైదు సంవ‌త్స‌రాల‌కు సంబంధించి వాహ‌న ప్ర‌మాదాల‌కు సంబంధించిన డేటా ప్ర‌స్తుతం వ‌ర‌కు జ‌రిగిన విశ్లేష‌ణ ప్ర‌కారం.. రాత్రి స‌మ‌యంలోనే అధికంగా ప్ర‌మాదాలు జ‌రిగాయ‌ని తెలిపారు. దీనికి అతివేగం కార‌ణాలు ఉన్నాయ‌న్నారు. హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ ఏడాది మ‌రిన్నీ స్పీడ్ మీట‌ర్ల‌ను కొనుగోలు చేసేందుకు కృషి చేస్తున్నారు. రాత్రిపూట కూడా ప‌ని చేసే స్పీడ్ గ‌న్‌ల కోసం వారు చూస్తున్నార‌ని A V Ranganath పేర్కొన్నారు. 

హైద‌రాబాద్ ట్రాఫిక్ జోన్ ప‌రిధిలో 2500 మంది కానిస్టేబుళ్లు.. 

మద్యం తాగి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నార‌ని తెలిపారు. నగరవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మద్యం తాగి వాహనాలు నడిపే వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నార‌ని తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పరిధిలో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ మరియు వెస్ట్-సెంట్రల్ అనే ఆరు జోన్‌లు ఉన్నాయి. ఈ మండలాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు 2500 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.

త్వ‌ర‌లోనే ఆటోరిక్షా మీటర్‌ రేట్ల స‌వ‌ర‌ణ.. 

2016 నుంచి అదే విధంగా ఉన్న ఆటోరిక్షాల మీటర్ రేట్లు త్వరలో సవరించే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మంది ఆటో డ్రైవర్లు రేట్లు సరిగా లేవని చెప్పడంతో మీటర్లను వినియోగించడం లేదు. బేరసారాలు సాగించాల్సి రావడంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, మీటర్ రేట్లను సవరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంబంధిత అధికారులను కోరుతున్నారని హైద‌రాబాద్ ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాథ్ (A V Ranganath) తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?