పెండింగ్ చలాన్లపై వాహనదారుల నుండి భారీ స్పందన: నిమిషానికి 700 లావాదేవీలు

Published : Mar 01, 2022, 09:38 AM IST
పెండింగ్ చలాన్లపై వాహనదారుల నుండి భారీ స్పందన: నిమిషానికి 700 లావాదేవీలు

సారాంశం

ప్రత్యేక డ్రైవ్ కు వాహన దారుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఇవాళ్టి నుండి ఈ నెలాఖరు వరకు పెండింగ్ లో ఉన్న చలాన్ల చెల్లింపునకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో Pending చలాన్ల చెల్లింపునకు వాహన దారుల నుండి భారీగా స్పందన వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఇవాళ్టి నుండి ఈ నెలాఖరు వరకు పెండింగ్ challan చెల్లింపునకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించారు. GHMC పరిధిలోని Hyderabad, రాచకొండ, Cyberabad కమిషనరేట్ల పరిధిలో సుమారు రూ. 600 కోట్లకు పైగా  వాహనదారుల నుండి చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి.

అయితే పెండింగ్ లో ఉన్న చలాన్ల డబ్బులను వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ ను ఉపయోగించుకోవాలని Traffic పోలీసులు కోరారు.  Special Drive సందర్భంగా జరిమానాను చెల్లించే వాహన దారులకు ట్రాఫిక్ పోలీసులు  భారీ రాయితీని ఇచ్చారు. 

ఇవాళ ఉదయం నుండి ఆన్ లైన్ లో వాహనదారులు పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నారు. నిమిషానికి 700 మంది వాహనదారులు తమ జరిమానాలను చెల్లిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.Corona సమయంలో బహిరంగ ప్రదేశాల్లో Mask లేకుండా తిరిగిన వారికి కూడా పోలీసులు జరిమానాను విధించారు. అయితే ఈ జరిమానా రూ. 1000 లు. అయితే  ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా  రూ. 100 లు చెల్లిస్తే సరిపోతుంది. నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా వాహన దారులు తమ పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ఆన్ లైన్ సేవలను ఉపయోగించుకొంటున్నారు.

టూ వీలర్ల యజమానులు 25 శాతం కార్ల యజమానులు 50 శాతం, ఆర్టీసీ బస్సులు 30 శాతం, తోపుడు బండ్ల యజమానులు 20 శాతం మాత్రమే పెండింగ్ చలాన్లలో చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తామని పోలీస్ శాఖ తెలిపింది.  మీ సేవా, ఆన్ లైన్ గేట్‌వే ల ద్వారా  ఈ చలాన్లను చెల్లించవచ్చని పోలీస్ శాఖ తెలిపింది.

మరో వైపు హైద్రాబాద్ లో ప్రమాదాలు ఏ సమయంలో జరుగుతున్నాయనే విషయమై కూడా అధ్యయనం చేశారు. రాత్రి పూట మాత్రమే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి సమయాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ లను ఉపయోగించాలని భావిస్తున్నారు. 

మద్యం తాగి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకొంటున్నారు. రాత్రి పూట చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ పరిధిలో సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, వెస్ట్-సెంట్రల్ అనే ఆరు జోన్లున్నాయి. ఈ జోన్లలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 2500 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. 

2016 నుండి ఉన్న ఆటో రిక్షాల మీటర్ల రేట్లను త్వరలోనే సవరించే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా మంది ఆటో డ్రైవర్లు మీటర్లను ఉపయోగించడం లేదు. దీంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మీటర్ల రేట్ ను సవరించే అవకాశాలను కూడా ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తున్నారు. కరోనా కారణంగా పెండింగ్ చలాన్ల చెల్లింపు విషయంలో కూడా పోలీస్ శాఖ డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొందనే ప్రచారం కూడా లేకపోలేదు.   అయితే పోలీస్ శాఖ తీసుకొన్న నిర్ణయం మాత్రం వాహనదారులకు పెద్ద ఊరటగానే చెప్పవచ్చు.

పెండింగ్ లో ఉన్న చలాన్లు ఉంటే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైన వాహనాన్ని నిలిపివేస్తే అక్కడే పెండింగ్ చలాన్లు చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి. అయితే మార్చి మాసంలో నిర్వహించే స్పెషల్ డ్రైవ్ ను ఉపయోగించుకోవాలని వాహన దారులకు పోలీస్ శాఖ సూచిస్తోంది. 

అయితే రూ. 600 కోట్లలో  ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా పోలీస్ శాఖకు ఎంత మేరకు వసూలు కానుందో మార్చి చివర్లో తేలనుంది. మరో వైపు  ఈ స్పెసల్ డ్రైవ్ నిర్వహించకపోతే రూ. 600 కోట్లలో వసూలయ్యేది ఎంతో కూడా ఇప్పుడే చెప్పలేమనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.  పెండింగ్ చలాన్ల చెల్లింపు కోసం వాహన దారులు ఈ స్పెషల్ డ్రైవన్ ఉపయోగించుకొంటారని పోలీస్ శాఖాధికారులు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్