వ్యాపారవేత్తల బ్లాక్ మెయిల్: హైద్రాబాద్ లో ముగ్గురి అరెస్ట్

Published : May 26, 2023, 03:44 PM IST
 వ్యాపారవేత్తల  బ్లాక్ మెయిల్: హైద్రాబాద్ లో  ముగ్గురి అరెస్ట్

సారాంశం

ప్రముఖ వ్యాపారవేత్తలను లక్ష్యంగా  చేసుకొని  బ్లాక్ మెయిల్ కు  పాల్పడుతున్న ముఠాను  హైద్రాబాద్  పోలీసులు   అరెస్ట్  చేశారు. 

హైదరాబాద్:   హైద్రాబాద్ లో  ప్రముఖ వ్యాపార వేత్తలను లక్ష్యంగా  చేసుకని  వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల  ముఠాను  మల్కాజిగిరి  ఎస్ఓటీ  పోలీసులు  శుక్రవారంనాడు  అరెస్ట్  చేశారు.

అమెరికాలో  ఉద్యోగం  చేసి హైద్రాబాద్ కు వచ్చిన  ప్రదీప్ అనే వ్యక్తి ఈ ముఠాకు  నాయకుడిగా  పోలీసులు గుర్తించారు.   ప్రదీప్ టెక్కీగా  పనిచేస్తున్నాడు.  సులభంగా  డబ్బులు సాధించాలనే   ఉద్దేశ్యంతో  వ్యాపారులను లక్ష్యంగా  చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా  పోలీసులు గుర్తించారు.  హైద్రాబాద్ లోని ఓ  స్కూల్  యజమానిని  ఈ ముఠా  రూ. 25 లక్షలు   ఇవ్వాలని డిమాండ్  చేసిందని  పోలీసులు గుర్తించారు.  స ఇదే  రకంగా  పలువురు వ్యాపారవేత్తలను కూడ నిందితులు  డబ్బులు డిమాండ్  చేశారని పోలీసులు చెబుతున్నారు.

ఈ విషయమై  పోలీసులకు అందిన సమాచారం  మేరకు   ఈ ముఠా సభ్యులను  పోలీసులు  అరెస్ట్ చేశారు.ఈ ముఠాలో ప్రదీప్, శ్రీకాంత్, రాజేష్లు సభ్యులుగా  ఉన్నారని  పోలీసులు చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu