కర్ణంగూడ కాల్పుల కేసు: మట్టారెడ్డిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు

Published : Mar 01, 2022, 12:15 PM ISTUpdated : Mar 01, 2022, 12:56 PM IST
కర్ణంగూడ కాల్పుల కేసు: మట్టారెడ్డిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు

సారాంశం

ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడ వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి మట్టారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

 హైద్రాబాద్: ఇబ్రహీంపట్నానికి సమీపంలోని Karnamguda వద్ద మంగళవారం నాడు జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి Matta Reddy అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Hyderabad నగరంలోని  Srinivas Reddy, రాఘవేందర్ రెడ్డి లు రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలనే 10 ఎకరాలను వీరిద్దరూ ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశారు.  అయితే  ఇంద్రారెడ్డి  విక్రయించిన  భూమిలో మట్లారెడ్డి అనే వ్యక్తి కబ్జాలో ఉన్నాడు. 

ఇవాళ ఉదయం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి రెడ్డిలు  కర్ణంగూడకు వచ్చారు. ఆ సమయంలో మట్టారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. భూమి విషయమై మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ సమయంలోనే కాల్పులు జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మట్టారెడ్డిని  పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లతో కలిసి మరో వ్యక్తి కూడా కారులో ప్రయాణించినట్టుగా సమాచారం. అయితే ఆ మూడో వ్యక్తి ఎవరనే విషయమై దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవాళ ఉదయమే రియల్ ఏస్టేట్ పని మీద బయటకు వెళ్తున్నట్టుగా రఘునందన్ రెడ్డి తన భార్యకు చెప్పారు.  ఇంటి నుండి ఉదయం 5 గంటలకు బయలు దేరారు. ఉదయం 8 గంటల సమయంలో  గొడవ జరిగిందని సమాచారం. అదే సమయంలోనే కాల్పులు జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే కాల్పులు ఎవరు జరిపారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అక్కడిక్కడే మరణించారు. రాఘవేందర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. రాఘవేందర్ రెడ్డిని బీఎన్ రెడ్డి నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాఘవేందర్ రెడ్డి  రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

కర్ణంగూడ ఘటన గురించి  రాఘవేందర్ రెడ్డి తన సన్నిహితులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా హఫీజ్ మరో వ్యక్తి సంఘటన స్థలానికి చేరుకొన్నారు. అయితే అదే సమయంలో అక్కడే మట్టారెడ్డి ఉన్నాడని హఫీజ్ చెప్పారు. అయితే  శ్రీనివాస్ రెడ్డితో గొడవ గురించి మట్టారెడ్డిని ప్రశ్నిస్తే తనకు ఏమీ తెలియదని ఆయన చెప్పారని హఫీజ్ మీడియాకు చెప్పారు.

సోమవారం నాడే మట్టారెడ్డిని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించినట్టుగా సమాచారం. శ్రీనివాస్ రెడ్డి కోనుగోలు చేసిన భూమి విషయమై  ఇతర ప్లాట్ల యజమానులను మట్టారెడ్డి రెచ్చగొడుతున్నారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారని హఫీజ్ మీడియాకు తెలిపారు. అయితే ఇవాళ ఉదయమే శ్రీనివాస్ రెడ్డితో పాటు రాఘవేందర్ రెడ్డిపై కాల్పులు జరిగాయి. శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రాఘవేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మూడు మాసాల క్రితమే 10 ఎకరాల భూమిని శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కొనుగోలు చేశారు. ప్రతి రోజూ  శ్రీనివాస్ రెడ్డి, ఈ ప్రాంతానికి వచ్చేవారు. తాను కొనుగోలు చేసిన భూమిలో వాకింగ్ చేసి తిరిగి వెళ్లేవాడు. అయితే ఇవాళ ఉదయం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలతో మట్టారెడ్డి ఇవాళ గొడవకు దిగారని చెబుతున్నారు. ఆ తర్వాతే కాల్పుుల జరిగాయని సమాచారం. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.