
పాకిస్తాన్ సరిహద్దులో హైదరాబాద్ వాసిని అరెస్ట్ చేశారు. మీర్చౌక్ నుంచి పాకిస్తాన్ వెళ్లేందుకు యత్నించగా.. రాజస్థాన్ సరిహద్దులో హైమద్ అలీని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా ఇరానీయన్ హైమద్ అలీ హైదరాబాద్లో మకాం వేశారు. పాతబస్తీ నుంచి దొంగ పాస్పోర్ట్ తీసుకున్నాడు హైమద్ అలీ. ఈ క్రమంలో దొంగ పాస్పోర్ట్తో పాకిస్తాన్లోకి వెళ్లేందుకు హైమద్ అలీ యత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.