నకిలీ రశీదులతో మోసం: సువర్ణభూమి ఎండీ సహా మరో ఐదుగురిపై హైద్రాబాద్‌లో కేసు

Published : Jun 15, 2023, 01:14 PM IST
నకిలీ రశీదులతో మోసం: సువర్ణభూమి  ఎండీ సహా మరో ఐదుగురిపై  హైద్రాబాద్‌లో  కేసు

సారాంశం

హైద్రాబాద్ కు  సమీపంలోని షాద్ నగర్ లో గల  సువర్ణభూమి  డెవలపర్స్  ప్రైవేట్ లిమిటెడ్  ఎండీ సహా  మరో ఐదుగురిపై  పోలీసులు కేసు నమోదు  చేశారు.

హైదరాబాద్: సువర్ణ భూమి  ఎండీ  బొల్లినేని శ్రీధర్ సహా  మరో ఐదుగురిపై  కేసు నమోదైంది.  హైద్రాబాద్ కు సమీపంలోన  షాద్ నగర్ వద్ద  సువర్ణభూమి  డెవలపర్స్  ప్రైవెట్ లిమిటెడ్ సంస్థ  ప్లాట్ల విక్రయం  చేపట్టింది.  ఈ వెంచర్ లో ప్లాట్లు  కొనుగోలు   కోసం డబ్బులు చెల్లించిన వారికి  నకిలీ  రసీదులు  ఇచ్చినట్టుగా   బాధితులు పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.   హైద్రాబాద్ జూబ్లీహిల్స్  పోలీస్ స్టేషన్ లో బాధితులు  ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు   సువర్ణభూమి ఎండీ  బొల్లినేని శ్రీధర్ పై  కేసు నమోదు  చేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి | Smart Ration Cards Launch
రాహుల్ గాంధీ రాముడైతే ఇయన హనుమంతుడు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు