స్వచ్ఛ భారత్ లో హైదరాబాద్ కు 3వ ర్యాంక్

Published : Nov 17, 2016, 03:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
స్వచ్ఛ భారత్ లో హైదరాబాద్ కు 3వ ర్యాంక్

సారాంశం

గణనీయంగా మెరుగుపడిన హైదరాబాద్ స్కోర్

స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో ముందున్న పట్టణాలు, నగరాల జాబితాను కేంద్రపట్టణాభివృద్ధి శాఖ ఈ రోజు విడుదల చేసింది. ఈ మేరకు జాబితాలో ఉన్న మొదటి పది స్థానాలను కేంద్రపట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది.

 

ఈ జాబితాలో అలీగఢ్ మొదటి స్థానంలో నిలువగా, హైదరాబాద్ మూడవ స్థానం, తిరుపతి 8వ స్థానంలో నిలిచాయి. 
 

రెండో స్థానంలో వసాయ్-విరార్ (మహారాష్ట్ర), నాలుగో స్థానం-గురుగ్రామ్ (హర్యానా), ఐదో స్థానం-చండీగఢ్ (హర్యానా), ఆరోస్థానం-మధురై (తమిళనాడు), ఏడో స్థానం-వడోదర, రాజ్‌కోట్ (గుజరాత్), తొమ్మిదో స్థానం లో మైసూరు (కర్ణాటక) నిలిచాయి.

 

కాగా, గత ఫిబ్రవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించిన ర్యాంకులో హైదరాబాద్  19 వ స్థానంలో నిలిచింది. ఇప్పడు గణనీయంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకొని మూడో స్థానానికి దూసుకరావడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?
Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్