హోం గార్డుతో అఫైర్: మహిళను చితకబాది, కిటికీకి కట్టేసి...

Published : Apr 05, 2021, 05:31 PM IST
హోం గార్డుతో అఫైర్: మహిళను చితకబాది, కిటికీకి కట్టేసి...

సారాంశం

హోంగార్డుతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ ఒంటరి మహిళపై దాడి చేశారు. హోంగార్డు బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆమెను బయట కిటికీకి కట్టేశారు.

ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. హోంగార్డుతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ మహిళపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో చోటు చేసుకుంది. ఇల్లందులోని ఎల్బీఎస్ నగర్ లో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ స్థానికంగా ఓ కిరాణా షాపులో పనిచేస్తుంది.

ఇల్లందు పోలీసు స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న నరేష్ అనే వ్యక్తి ఇల్లందులోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో నరేష్ ఆదివారం మధ్యాహ్నం నరేష్ మహిళ ఇంట్లో ఆమెతో మాట్లాడుతుండగా నరేష్ తల్లితో పాటు అతడి బంధువులు ఆ మహిళ ఇంటిపై దాడి చేశారు.

ఆమెను విచక్షణారహితంగా చితకబాది ఆమెను బయట కిటికీకి కట్టేశారు. అయితే బాధితురాలు మాత్రం నరేష్ తన వద్ద నుంచి కొందరికి డబ్బులు ఇప్పిస్తాడని, ఆ క్రమంలోనే ఆదివారం డబ్బులు కోసం వచ్చాడని చెబుతోంది.

గత కొన్ని రోజులుగా నరేష్ ఇంటికి సరిగా రాకపోవడం, తరుచుగా ఆ మహిళ ఇంటికి వెళ్తుండడం వంటి కారణాలతో ఆ మహిళకు, నరేష్ కు మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోందని నరేష్ బంధువులు నమ్ముతున్నారు. దాంతో ఆమెపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu