కోకాపేట్​ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు: పోలీసులకు హెచ్ఎండీఏ ఫిర్యాదు

Siva Kodati |  
Published : Jun 26, 2021, 07:04 PM IST
కోకాపేట్​ భూముల పేరుతో ప్రైవేటు ప్రకటనలు: పోలీసులకు హెచ్ఎండీఏ ఫిర్యాదు

సారాంశం

హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వ‌ర్యంలో కోకాపేట్​ లే అవుట్‌లో భూముల​ ఈ‌‌‌‌ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతున్న నేప‌థ్యంలో దీనిని సాకుగాచూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్న సీఎన్ఎన్ వెంచ‌ర్స్ అనే సంస్థపై సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్​ ( సీసీఎస్ ​) పోలీసులు ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు.

హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వ‌ర్యంలో కోకాపేట్​ లే అవుట్‌లో భూముల​ ఈ‌‌‌‌ – ఆక్షన్ ప్రక్రియ కొనసాగుతున్న నేప‌థ్యంలో దీనిని సాకుగాచూపి అమాయక ప్రజలను మోసం చేస్తున్న సీఎన్ఎన్ వెంచ‌ర్స్ అనే సంస్థపై సెంట్రల్​ క్రైమ్​ స్టేషన్​ ( సీసీఎస్ ​) పోలీసులు ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్​టిసి లిమిటెడ్ ద్వారా జరుగుతున్న కోకాపేట్​ భూముల ఈ – ఆక్షన్​ ప్రక్రియ పూర్తికాకముందే ప్రజలను మభ్యపెట్టేవిధంగా సదరు సీఎన్ఎన్​ వెంచర్స్​ కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి వంచనకు గురిచేస్తున్న తీరును హెచ్​ఎండిఏ తీవ్రంగా పరిగణించింది. కోకాపేట్​ భూములను మార్కెట్​ విలువలో 50 శాతం పెట్టుబడులతో, 1,500 చదరపు అడుగుల వరకు 3బిహెచ్​కె ఫ్లాట్​ లను సొంతం చేసుకోవచ్చని సీఎన్ఎన్​ వెంచర్స్​ త‌మ ప్రకటనల ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న‌ది అని హెచ్ఎండీఏ పేర్కొన్న‌ది.

Also Read:కొత్త జిల్లాల ప్రకారమే.. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు: ఉపాధ్యాయ నేతలకు కేసీఆర్ హామీ

ఒకవైపు కోకాపేట్​ భూముల ఈ–ఆక్షన్​ ప్రక్రియ కొనసాగుతుండగా, తక్కువ ధరలకు/రేట్లకు పెట్టుబడులు పెట్టి 3బిహెచ్​కె ఫ్లాట్లను కొనుగోలు చేసుకోవచ్చని సామాన్య ప్రజానీకాన్ని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రజల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న సీఎన్ఎన్​ వెంచర్స్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ సెక్రెటరీ, ఔటర్​ రింగ్​ రోడ్డు (ఓఆర్ఆర్)​ ప్రాజెక్టు డైరెక్టర్​ సంతోష్​ ఐఏఎస్​ శుక్రవారం నగర పోలీస్​ కమిషనర్​ కు ఫిర్యాదు చేశారు.

హెచ్ఎండీఏ భూముల వేలం పూర్తికాకముందే, నిర్ణిష్టమైన అనుమతులు లేకుండానే అమాయక ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న సీఎన్ఎన్​ వెంచర్స్‌‌పై కఠిన చర్యలు తీసుకుని హెచ్ఎండీఏ ప్రతిష్టతను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార ప్రకటనలను, లావాదేవీలను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు విశ్వసించరాదని హెచ్ఎండీఏ సూచించింది.
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ కు 50 కి.మీ దూరంలో మరో కూకట్ పల్లి.. ఇక్కడ రూ.40-50 లక్షలకే ఇండిపెండెంట్ హౌస్, భవిష్యత్ లో అయితే కోట్లు..!
Weather Update : ఈ తెలుగు జిల్లాల్లో వింత వెదర్.. పగలంతా పీక్ ఎండలతో ఆరెంజ్, సాయంత్రం జోరువానలతో ఎల్లో అలర్ట్