సమ్మక్క- సారక్క జాతర : ఎమ్మెల్యే చల్లా ఆదేశం.. శిలాఫలకం కూల్చివేత, కాంగ్రెస్- టీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణ

By Siva KodatiFirst Published Jan 22, 2022, 9:28 PM IST
Highlights

హన్మకొండ జిల్లా (hanmakonda district) ఆత్మకూరు (atmakur) మండలం అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర (sammakka sarakka jatara) నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం రసాభాసగా మారింది. 

హన్మకొండ జిల్లా (hanmakonda district) ఆత్మకూరు (atmakur) మండలం అగ్రం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర (sammakka sarakka jatara) నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (challa dharma reddy) మాట్లాడుతూ.. జాతర ప్రాంగణంలో ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని ఆదేశించారు. ఆ వెంటనే అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేత  మోరే మహేందర్‌ గునపంతో దానిని ధ్వంసం చేశారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ (congress) కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

2010లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌ రావు (konda muralidhar rao) , ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జాతరకు కొంత భూమిని దానం చేశారు. ఆ స్థలంలో ఓ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో దాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కొండా సురేఖ (konda surekha) , ఆమె కుమార్తె సుస్మిత పటేల్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

కాగా.. ఆసియాలోనే అతి పెద్ద జాత‌ర మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర.  ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పూజారుల సంఘం నిర్ణయించింది. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జాతర జరగనుండడంతో రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జరిగే..  సమ్మక్క సారలమ్మ జాత‌ర‌లో ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకు వస్తారు. 17న మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె పైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయియడంతో మహా జాతర ముగుస్తుంది.  

ఈ జాత‌ర‌కు కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు ఇంకా సమయం మున్న‌దున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. టీఎస్ ఆర్టీసీ కూడా  ఏర్పాట్లు చేసింది. మేడారం భక్తుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా బస్సుల‌ను నడిపించ‌డానికి  సిద్ధమైంది. మేడారం జాతర కోసం టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు ప్రత్యేక సర్వీసులు న‌డ‌ప‌నున్న‌ది. ఉదయం 7గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరుతాయి. ప్ర‌తిరోజు సాయంత్రం 4గంటలకు మేడారం నుంచి హన్మకొండకు వస్తాయి.  హన్మకొండ నుంచి మేడారం ప్ర‌యాణీకుల‌కు పెద్దలకు రూ.125, పిల్లలకు రూ.65 ఛార్జీలుగా టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ జాతర కోసం దాదాపు  3,835 బస్సు సర్వీసులను నడపనున్నారు. అలాగే.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 51 బస్సు పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇందు కోసం 12,267 మంది సిబ్బంది సేవలను ఆర్టీసీ వినియోగించుకోనుంది.

click me!