గణేష్ విగ్రహాల నిమజ్జనం.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

Published : Sep 25, 2023, 01:08 PM IST
గణేష్ విగ్రహాల నిమజ్జనం.. తెలంగాణ హైకోర్టు  కీలక ఆదేశాలు..

సారాంశం

ణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్) విగ్రహాల నిమజ్జనం చేయొద్దని మరోసారి స్పష్టం చేసింది.

హైదరాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌ సాగర్‌తో పాటు నగరంలోని చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్) విగ్రహాల నిమజ్జనం చేయొద్దని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని నగర పోలీసు కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లను కూడా ఆదేశాలు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌ (నీటి కుంటలు)లో నిమజ్జనం చేయాలని సూచించింది.  ఇక, పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధిస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలులో ఉన్నాయని ఇదివరకే హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Summer Holidays Extended : ఈ నెలంతా వేసవి సెలవులే.. జూలై ఫస్ట్ కే స్కూల్స్ రీఓపెన్