హెరిటేజ్ ను వదిలించుకున్న బాబు

Published : Nov 07, 2016, 01:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
హెరిటేజ్ ను వదిలించుకున్న బాబు

సారాంశం

124 స్టోర్లను సొంతం చేసుకున్న ఫ్యూచర్ గ్రూప్

ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన రిటైల్ గ్రూప్ సంస్థ హెరిటేజ్ ను దేశంలోని అతిపెద్ద రిటైల్ గ్రూప్ సంస్థ  ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకుంది. హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన రిటైల్ డివిజన్‌ను కొనుగోలు చేసింది.  హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన  124 స్టోర్లను ఫ్యూచర్ గ్రూప్ నకు అప్పగించింది. ఇకపై హెరిటేజ్ స్టోర్లు ఫ్యూచర్ గ్రూప్లో భాగంగా ఉంటాయి. దీనికి బదులుగా ఫ్యూచర్ గ్రూప్ సంస్థ తన షేర్లలోని 3.5 శాతం వాటాను హెరిటేజ్ గ్రూప్ కు  ఇవ్వనుంది.

ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఇప్పటికే బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో దూసుకెళ్తుంది. బిగ్‌బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా 738 స్టోర్స్‌ను కలిగి వున్న కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు వ్యాపార విస్తరణపై దృష్టిసారిస్తోంది. 24 ఏళ్ల కిందట ప్రారంభమైన హెరిటేజ్ సంస్థలో చంద్రబాబునాయుడు శ్రీమతి భువనేశ్వరీ దేవికి 22.98 శాతం, లోకేష్ నాయుడికి 10.2, కోడలు బ్రాహ్మణికి 0.44 శాతం, చంద్రబాబునాయుడు వియ్యుంకుడుకి 0.3 శాతం, ప్రమోటర్లకు 39.9 శాతం భాగస్వామ్యాలున్నాయి.

 

 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
సైబర్ మోసాలపై అలర్ట్ చేసిన నాగార్జున సూపర్ స్పీచ్ | Akkineni Nagarjuna Cyber Awareness Programme