హైద్రాబాద్ సరూర్‌నగర్‌లో వర్షం తెచ్చిన విషాదం: గుండెపోటుతో మహిళ మృతి

Published : Sep 03, 2021, 11:42 AM IST
హైద్రాబాద్ సరూర్‌నగర్‌లో వర్షం తెచ్చిన విషాదం:  గుండెపోటుతో మహిళ మృతి

సారాంశం

హైద్రాబాద్ సరూర్‌నగర్  కోదండరామనగర్ లో వరద నీటిలో అంబులెన్స్ చిక్కుకోవడంతో ఓ మహిళ మరణించింది. గుండెపోటు రావడంతో అంబులెన్స్ పిలిచినా ఆ కుటుంబానికి ఫలితం దక్కలేదు.వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది.

హైదరాబాద్: హైద్రాబాద్ సరూర్‌నగర్ కోదండనగర్‌లో వరద నీటిలో అంబులెన్స్ చిక్కుకుపోవడంతో ఓ మహిళ  మృతి చెందింది.గురువారం నాడు సాయంత్రం  హైద్రాబాద్ నగరంలో  భారీ వర్షం కురిసింది.ఈ వర్షంతో సరూర్ నగర్ చెరువు నుండి  కోదండరామునగర్‌లో వరద నీరు ముంచెత్తింది.

మళ్లీ వరదతో తమ ఇంటిని ముంచెత్తుతోందనే ఆవేదన కారణంగా ఓ మహిళకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వరద నీటిలో చిక్కుకుపోయింది. బాధితురాలి ఇంటి వద్దకు అంబులెన్స్ చేరలేదు.

అయితే స్ట్రెచర్ పై బాధితురాలిని  అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చారు  ఈ లోపుగానే  బాధితురాలు మరణించింది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.హైద్రాబాద్ నగరంలో వర్షం కురిస్తే సరూర్ నగర్  చెరువు కింద ఉన్న కోదండరామనగర్‌, వివేకానంద నగర్ తదితర  కాలనీలను వర్షపు నీరు ముంచెత్తుతుంది. వర్షం వస్తే ఈ  కాలనీ వాసులు భయంతో గడుపుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu