సంగారెడ్డి ప్రమాదంపై హరీష్ ఏమన్నారంటే....

Published : Sep 29, 2018, 02:28 PM ISTUpdated : Sep 29, 2018, 03:58 PM IST
సంగారెడ్డి ప్రమాదంపై హరీష్ ఏమన్నారంటే....

సారాంశం

సంగారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన జిల్లా మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మంత్రికి స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా టపాసులు కాలుస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది. టపాసులకు మంటలు అంటుకుని చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే మంత్రికి అతి సమీపంలో ఈ ప్రమాదం జరిటగినప్పటి మంత్రి సురక్షితంగా ఇక్కడినుండి బైటపడ్డారు.  

సంగారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన జిల్లా మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మంత్రికి స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా టపాసులు కాలుస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది. టపాసులకు మంటలు అంటుకుని చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే మంత్రికి అతి సమీపంలో ఈ ప్రమాదం జరిటగినప్పటి మంత్రి సురక్షితంగా ఇక్కడినుండి బైటపడ్డారు.

ఈ ఘటనపై మంత్రి హరీష్ తన ట్విట్టర్ లో స్పందించారు. సంగారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన చిన్న ప్రమాదంలో తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. తాను క్షేమంగానే వున్నానని... టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన క్షేమం గురించి పరితపిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

హరీష్ రావుకి తృటిలో తప్పిన ప్రమాదం


 

 

PREV
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu