తెలంగాణ గురుకుల అభ్యర్థులకు మరో షాక్

Published : Aug 22, 2017, 08:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
తెలంగాణ గురుకుల అభ్యర్థులకు మరో షాక్

సారాంశం

గురుకుల పిడి మెయిన్స్ పరీక్ష రద్దు లోపాలను ఆలస్యంగా గుర్తించిన టిఎస్పిఎస్సీ సెప్టెంబరు 7వ తేదీన మళ్లీ పీడి మెయిన్స్ పరీక్ష గతంలో జులై 18న జరిపిన టిఎస్పిఎస్సీ

తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ చుక్కలు చూపుతున్నది. తాజాగా గురుకుల పిడి పోస్టులకు జరిపిన మెయిన్స్ ను రద్దు చేస్తూ టిఎస్పిఎస్సీ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఈ పరీక్షలను నిర్వహిస్తామని కమిషన్ తాజాగా ప్రకటించింది.

జులై 18వ తేదీన గురుకుల పిడి పోస్టుకు టిఎస్పిఎస్సీ మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. అయితే ఆ పరీక్షలో లోపాలున్నట్లు ఆలస్యంగా గుర్తించింది టిఎస్పిఎస్సీ. ఒక సిరీస్ పశ్నాపత్రంలో ఒక పేజీ లేకుండానే పరీక్షలు జరిపినట్లు గుర్తించింది టిఎస్పిఎస్సీ. అందుకే పరీక్షను రద్దు చేసి సెప్టెంబరు 7వ తేదీన మళ్లీ నిర్వహిస్తామని వెల్లడించింది.

అయితే పరీక్ష రాసి రిలాక్స్ గా ఉన్న అభ్యర్థులకు పిడుగులాంటి వార్త ప్రకటించడంతో మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన తరుణం ఆసన్నమైందని నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. గురుకులాల పోస్టుల నోటిఫికేషన్ నాటి నుంచి మెయిన్స్ పరీక్షలు జరిపే వరకు అనేకరకాలుగా నిరుద్యోగులతో టిఎస్పిఎస్సీ చెలగాటమాడిందని, ఈ ప్రక్రియ మళ్లీ కొనసాగుతోందని నిరుద్యోగ జెఎసి మండిపడింది.

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: వీళ్ళిద్దరికీ కి ఈ బిల్డింగ్ కనిపించడం లేదా? | Jagruthi | Asianet News Telugu
హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు | BJP Chief RamChander Rao | Asianet News Telugu