Group 2: గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా?

Published : Dec 25, 2023, 09:32 PM IST
Group 2: గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా?

సారాంశం

గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడుతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ నెల 6, 7 తేదీల్లో పరీక్షలు ఉన్నాయి. కానీ, టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.  

Telangana: మన రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడేలా ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. కీలక సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6వ, 7వ తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఇంకా అటూ ఇటుగా పది రోజుల గడువు ఉన్నది. కానీ, ఎలాంటి చర్యలు లేవు. దీంతో అభ్యర్థులు ఈ సారి కూడా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడతాయా? అనే టెన్షన్‌లో ఉన్నారు.

గ్రూప్ 2 పరీక్షలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇది వరకైతే గ్రూప్ 2 పరీక్షల కోసం టీస్‌పీఎస్సీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఒక వేళ పరీక్ష తేదీని రీషెడ్యూల్ చేస్తారా? లేక మరికొన్ని పోస్టులను చేర్చి రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేస్తారా? అనేది తెలియకుండా ఉన్నది. ఈ అంశాలపై టీఎస్‌పీఎస్సీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Also Read: KTR: బీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్.. పార్లమెంటు ఎన్నికల కోసం సిద్ధమవ్వండి: కేటీఆర్

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోటీ పరీక్షలపై రివ్యూ చేసింది. కానీ, గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ గురించి క్లారిటీ ఇవ్వలేదు. 

గ్రూప్ 2 సంబంధ 783 పోస్టుల కోసం నోటిఫికేషన్ రాగా.. 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఇప్పుడు పరీక్ష నిర్వహణపై టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

తెలంగాణ గవర్నర్ కి థ్యాంక్స్ చెప్పిన స్విగ్గి, జొమాటో బాయ్స్.. ఎందుకో తెలుసా?
Advocate Allam Nagaraju Sensational Comments : బండి భగీరథ్ పై కేసు నిలవదు ?? | Asianet News Telugu