కుక్కను నేను కరవమని చెప్పానా?: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి

Published : Mar 06, 2023, 06:16 PM IST
  కుక్కను  నేను  కరవమని చెప్పానా?: జీహెచ్ఎంసీ మేయర్  గద్వాల విజయలక్ష్మి

సారాంశం

రాజకీయాల్లోకి వచ్చిన  మహిళలను చూస్తే  కొందరు ఓర్వలేరని  జీహెచ్ఎంసీ  మేయర్  గద్వాల విజయలక్ష్మి  చెప్పారు.    


  హైదరాబాద్: ఎవరినో  కుక్క కరిస్తే   తానే  కరమనట్టుగా  బురద చల్లారని జీహెచ్ఎంసీ మేయర్  గద్వాల విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం  చేశారు. సోమవారం నాడు బీఆర్ఎస్ మహిళా విభాగం  ఆధ్వర్యంలో  నిర్వహించిన  మ:హిళా దినోత్సవ వేడుకల్లో  మేయర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆమె  ప్రసంగించారు.  రాజకీయాల్లో   మహిళల గురించి చెడుగా  మాట్లాడుతారన్నారు.  మహిళలు బయటకు వస్తే   కొందరు  ఓర్వేరని ఆమె  అభిప్రాయపడ్డారు. మేయర్ గా  తాను  ఎన్నో బాధ్యతలు , కష్టాలను  చూసినట్టుగా  ఆమె తెలిపారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి  19వ తేదీన అంబర్ పేటలో  వీధి కుక్కల దాడిలో  నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారి మృతి చెందాడు.  ఈ ఘటనతో  జీహెచ్ఎంసీ పై  పలువురు విమర్శలు గుప్పించారు.  

వీధి కుక్కలను అరికట్టడంలో  జీహెచ్ఎంసీ  పాలకవర్గం  వైఫల్యం చెందినట్టుగా విమర్శలు వెల్లువెత్తాయి.   ఈ విమర్శలపై  ఇవాళ  ఆమె  పరోక్షంగా స్పందించారు. రాష్ట్రలలోని  పలు జిల్లాల్లో   వీధి కుక్కల దాడులు  చోటు  చేసుకుంటున్నాయి.   వీధి కుక్కలను నియంత్రించేందుకు  చర్యలు తీసుకుంటున్నామని  ప్రభుత్వం  ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR
NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu