సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత: టెండర్లు ఆహ్వానించిన జీహెచ్ఎంసీ

By narsimha lodeFirst Published Jan 25, 2023, 9:31 AM IST
Highlights

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేతకు  జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.  ఇతర భవనాలకు  నష్టం వాటిల్లకుండా ఉండేలా  భవనం కూల్చివేయాలని  జీహెచ్ఎంసీ సూచించింది. 

హైదరాబాద్: సికింద్రాబాద్  రాంగోపాల్ పేట  డెక్కన్  మాల్   కూల్చివేతకు  జీహెచ్ఎంసీ  అధికారులు  టెండర్లను పిలిచారు.    అగ్ని ప్రమాదం కారణంగా ఈ భవనం పూర్తిగా బలహీనపడింది. దీంతో  ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకన్నారు.   భవనం కూల్చివేత  విషయంలో  పక్కనే  ఉ్న ఇతర భవనాలకు  నష్టం వాటిల్లకుండా  ఉండాలని అధికారులు  సూచిస్తున్నారు. 

1890 చదరపు అడుగుల్లో డెక్కన్  స్పోర్ట్స్ వేర్ భవనం నిర్మించారు.   ఈ భవనం కూల్చివేతకు    రూ. 33.86 లక్షలతో టెండర్లను ఆహ్వానించారు.  భవనం కూల్చివేతకు  ఆధునాతన యంత్రాలు వాడాలని సూచించారు.  భవనం కూల్చివేసే సమయంలో  చుట్టుపక్కల వారికి  ప్రమాదం జరగకుండా  అధికారులు కోరారు.  

ఈ నెల  19వ తేదీన   రాంగోపాల్ పేట  డెక్కన్ మాల్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా భవనంలో  ఆరు అంతస్థులు  పూర్తిగా దెబ్బతిన్నాయి.  సుమారు  11 గంటల పాటు  కష్టపడి  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ భవనంలో  ఉన్న సింథటిక్ , టైర్లు ఇతర మెటీరియల్  మంటలు త్వరగా  వ్యాప్తి చెందడానికి కారణంగా మారిందనే   అగ్నిమాపక సిబ్బంది  అభిప్రాయపడ్డారు.

ఈ భవనం నుండి నలుగురిని  అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అయితే  ఈ భవనంలో విధులకు వెళ్లిన  వారిలో  ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే  ఈ భవనంలోని సెల్లార్ లో  ఒక అస్థిపంజరం  లభ్యమైంది. ఈ ఆస్థి పంజరం నమూనాలను  ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.  ఈ ఆస్థి పంజరం ఎవరిదనే  విషయాన్ని నిర్ధారించనున్నారు.
 

click me!