సికింద్రాబాద్ కస్తూర్బా స్కూల్‌లో విష వాయువుల లీక్.. విద్యార్ధులకు అస్వస్థత

By Siva KodatiFirst Published Nov 18, 2022, 2:39 PM IST
Highlights

సికింద్రాబాద్ కస్తూర్బా స్కూల్‌లో విష వాయువుల లీకేజ్ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో 10 మంది విద్యార్ధులకు పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. 

సికింద్రాబాద్ కస్తూర్బా స్కూల్‌లో విష వాయువుల లీకేజ్ ఘటన కలకలం రేపుతోంది. సైన్స్ ల్యాబ్‌లో ఈ విషవాయువులు లీకైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 10 మంది విద్యార్ధులకు పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!