వేస్ట్ పేపర్ తో గాంధీ విగ్రహం: ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

Published : Oct 01, 2019, 06:20 PM IST
వేస్ట్ పేపర్ తో గాంధీ విగ్రహం: ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

సారాంశం

 పర్యావరణ గాంధీ విగ్రహాన్ని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్​రావు ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా ఎంసీహెచ్చార్డీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్: మహాత్మగాంధీజి 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వేస్ట్ పేపర్ తో గాంధీ విగ్రహాన్ని రూపొందించారు వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ సిలివేరు మనోహర్. వేస్ట్ పేపర్ తో తయారు చేసిన ఈ  గాంధీ విగ్రహాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేశారు. 

పర్యావరణ గాంధీ విగ్రహాన్ని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్​రావు ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా ఎంసీహెచ్చార్డీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డైరెక్టర్​ జనరల్​ బీపీ ఆచార్య విగ్రహాన్ని ఆవిష్కరించాలని మంత్రి హరీష్ రావు ను ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా శిల్పి సిలివేరు మనోహర్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకి మహాత్మగాంధీ చిత్రపటాన్ని అందజేశారు డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య.  

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu