వేస్ట్ పేపర్ తో గాంధీ విగ్రహం: ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

Published : Oct 01, 2019, 06:20 PM IST
వేస్ట్ పేపర్ తో గాంధీ విగ్రహం: ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు

సారాంశం

 పర్యావరణ గాంధీ విగ్రహాన్ని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్​రావు ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా ఎంసీహెచ్చార్డీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 

హైదరాబాద్: మహాత్మగాంధీజి 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వేస్ట్ పేపర్ తో గాంధీ విగ్రహాన్ని రూపొందించారు వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ సిలివేరు మనోహర్. వేస్ట్ పేపర్ తో తయారు చేసిన ఈ  గాంధీ విగ్రహాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేశారు. 

పర్యావరణ గాంధీ విగ్రహాన్ని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్​రావు ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా ఎంసీహెచ్చార్డీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డైరెక్టర్​ జనరల్​ బీపీ ఆచార్య విగ్రహాన్ని ఆవిష్కరించాలని మంత్రి హరీష్ రావు ను ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా శిల్పి సిలివేరు మనోహర్ ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకి మహాత్మగాంధీ చిత్రపటాన్ని అందజేశారు డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య.  

PREV
click me!

Recommended Stories

వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump