తెలంగాణలో ఎన్నికలపై పాట: సిఈవోను కలిసి గద్దర్ వినతి

Published : Oct 08, 2018, 04:40 PM ISTUpdated : Oct 08, 2018, 05:29 PM IST
తెలంగాణలో ఎన్నికలపై పాట: సిఈవోను కలిసి గద్దర్ వినతి

సారాంశం

ప్రజాగాయకుడు గద్దర్ తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిశారు. ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తనుకు అనుమతినివ్వాలంటూ కోరారు. ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్యానికి ఓటు ఒక జీవననాడి అని తెలిపేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని రజత్ కుమార్ కు తెలిపారు. 

హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిశారు. ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తనుకు అనుమతినివ్వాలంటూ కోరారు. ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్యానికి ఓటు ఒక జీవననాడి అని తెలిపేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని రజత్ కుమార్ కు తెలిపారు. 

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, భారతదేశాన్ని రక్షించుకుందాం అన్న నినాదంతో రెండేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో ప్రచారం చేశానని తెలిపారు. ప్రజల పాట మాట ఆట ద్వారా రాజ్యాంగ ప్రియాంబుల్స్ ను గుండెకద్దుకుని ప్రచారం చేశానన్నారు. 

తానొక గాయపడ్డ ప్రజల పాటనన్న గద్దర్ తనకు గతంలో 2 ప్లస్ 2 సెక్యూరిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తాను చేపట్టబోయే ప్రచారానికి అనుమతినిస్తూ సహాయ సహకారాలు అందించాలని గద్దర్ పాటరూపంలో కోరారు.

                                            

 

PREV
click me!

Recommended Stories

Top 5 Startups : హైదరాబాద్ లో ప్రారంభమై గ్లోబల్ స్థాయికి ఎదిగిన టాప్ 5 స్టార్టప్స్ ఇవే
Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?