టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

sivanagaprasad kodati |  
Published : Oct 01, 2018, 11:04 AM IST
టెన్త్ విద్యార్థుల సజీవదహనం..వారి గొడవలు మాకు తెలియదు: స్కూలు యజమాన్యం

సారాంశం

జగిత్యాల జిల్లాలో ఇద్దరు టెన్త్ విద్యార్థుల సజీవదహనం వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. దీనిపై పాఠశాల యాజమాన్యం స్పందించింది.. ఇద్దరు విద్యార్థుల్లో మహేందర్ అనే విద్యార్థి రోజూ స్కూలుకు వస్తాడని.. రవితేజ అప్పుడప్పుడే స్కూలుకు వస్తాడని సెయింట్ జాన్ స్కూలు కరస్పాండెంట్ శోభ తెలిపారు.

జగిత్యాల జిల్లాలో ఇద్దరు టెన్త్ విద్యార్థుల సజీవదహనం వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. దీనిపై పాఠశాల యాజమాన్యం స్పందించింది.. ఇద్దరు విద్యార్థుల్లో మహేందర్ అనే విద్యార్థి రోజూ స్కూలుకు వస్తాడని.. రవితేజ అప్పుడప్పుడే స్కూలుకు వస్తాడని సెయింట్ జాన్ స్కూలు కరస్పాండెంట్ శోభ తెలిపారు.

అయితే వాళ్ల మధ్య గొడవలు జరుగుతున్న విషయం తమకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థుల మృతికి సంతాపంగా ఇవాళ స్కూలుకు సెలవుకు ప్రకటించినట్లు శోభ తెలిపారు.

ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రవితేజ, మహేందర్ అనే విద్యార్థులు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో వారి మధ్య వివాదం చెలరేగింది.. దీనిలో భాగంగా ఆదివారం మద్యం సేవించిన వీరిద్దరూ అమ్మాయి విషయంలో మరోసారి గొడవకు దిగారు. అది శృతిమించడంతో ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో.. సజీవ దహనమయ్యారు.

ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?