ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

Published : Aug 14, 2020, 11:00 AM ISTUpdated : Aug 14, 2020, 11:07 AM IST
ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి

సారాంశం

వంట గదిలో అజీరాం బీ, డైనింగ్ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక గుంత వద్ద అల్లుడు, హాలులో హసీనా మృతదేహాలు పడి ఉన్నాయి.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఒకే కుటుంబంలో నలుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ దారుణ సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఆజీరాం(63), ఆమె కుమార్తె ఆస్మా బేగం(35), అల్లుడు ఖాజా పాషా(42), మనుమరాలు హసీనా(10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వంట గదిలో అజీరాం బీ, డైనింగ్ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక గుంత వద్ద అల్లుడు, హాలులో హసీనా మృతదేహాలు పడి ఉన్నాయి.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్షుద్రపూజలు జరిగినట్లు ఇంటి ఆవరణలో ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?