తెలంగాణ సరిహద్దులోనే అంబులెన్స్‌ల నిలిపివేత: కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

Published : May 14, 2021, 11:18 AM IST
తెలంగాణ సరిహద్దులోనే అంబులెన్స్‌ల నిలిపివేత: కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

సారాంశం

సరిహద్దుల్లో ఏపీకి చెందిన అంబులెన్స్‌లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ను మాజీ ఐఆర్ఎస్ అధికారి  జి. వెంకటకృష్ణారావు శుక్రవారం నాడు దాఖలు చేశారు. 

హైదరాబాద్: సరిహద్దుల్లో ఏపీకి చెందిన అంబులెన్స్‌లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ను మాజీ ఐఆర్ఎస్ అధికారి  జి. వెంకటకృష్ణారావు శుక్రవారం నాడు దాఖలు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వైద్యం కోసం తెలంగాణలోకి వచ్చేవారికి ప్రత్యేక గైడ్‌లైన్స్ ను విడుదల చేసింది కేసీఆర్ సర్కార్.  తెలంగాణ రాష్ట్ర ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని  తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా  శుక్రవారం నాడు  తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో  భారీగా అంబులెన్స్ లను ఇతర వాహనాలను  నిలిపివేశారు. 

also read:సరిహద్దుల్లో కఠినంగా ఆంక్షలు: అనుమతి ఉంటెనే తెలంగాణలోకి ఎంట్రీ

ఈ విషయమై  మాజీ ఐఆర్ఎస్ అధికారి వెంకట కృష్ణారావు శుక్రవారం నాడు  తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది. సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపివేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి మూడు  రోజుల క్రితం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్