కర్ణాటక బీదర్ లో రోడ్డు ప్రమాదం: హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మృతి

By narsimha lodeFirst Published Aug 15, 2022, 8:23 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైద్రాబాద్ వాసులు మరణించారు. బీదర్ లోని కంటైనర్ ను కారు ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

హైద్రాబాద్ బేగంపేటకు చెందిన  గిరిధర్, ప్రియ, అనిత, మహేష్,జగదీష్ మృతి చెందారు. మరో వైపు ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

click me!