హైద్రాబాద్ శివారులో కాల్పుల కలకలం: బర్త్ డే వేడుకల్లో ఫైరింగ్

By narsimha lodeFirst Published Aug 15, 2022, 6:25 PM IST
Highlights

హైదరాబాద్:  హైద్రాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో సోమవారం నాడు కాల్పులు  జరిగాయి.   శివారులోని ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ సందర్భంగా కాల్పులు జరిగాయని సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో ఈ కాల్పుల ఘటన జరిగిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది

హైదరాబాద్:  హైద్రాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో  సోమవారం నాడు కాల్పులు  జరిగాయి.   శివారులోని  ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ సందర్భంగా కాల్పుల ఘటన చోటు చేసుకొంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఫామ్ హౌస్ లో జరిగిన బర్త్ డే  పార్టీ సందర్భంగా  కాల్పుల ఘటన జరిగిందని ప్రచారం సాగుతుందని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. ఓ పార్టీకి చెందిన నేతలు ఈ ఫైరింగ్ కు పాల్పడినట్టుగా  ఈ కథనం ప్రసారం చేసింది.  ఇద్దరు  గాల్లోకి పాల్పడ్డారు. ఈ ఇద్దరి వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. అయితే ఈ ఇద్దరు కూడా ఈ వీడియోలను డీపీలుగా పెట్టుకున్నారు. వీరు ఉపయోగించిన ఆయుధాలు ఎలాంటి ఆయధాలు అనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ గన్సా, లేక ఇతర ఆయుధమా, ఈ ఆయుధంలో ఉపయోగించిన బుల్లెట్లు ఎక్కడివి, ఈ ఆయుధం ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

రెండు రోజుల క్రితం స్పోర్ట్స్ మీట్ ప్రారంభాన్ని పురస్కరించుకొని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనను విపక్షాలు తీవ్రంగా తప్పు బట్టాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గౌడ్ కాల్పుల ఘటనను చూస్తే తెలంగాణలో మరోసారి రజాకార్ల పాలన వచ్చిందని తేలిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

click me!