దారుణం : సెల్‌ఫోన్ ఇస్తామంటూ.. ఏడేళ్ల బాలికపై తండ్రీ, కొడుకుల అత్యాచారం

Siva Kodati |  
Published : Aug 11, 2023, 06:00 PM IST
దారుణం : సెల్‌ఫోన్ ఇస్తామంటూ.. ఏడేళ్ల బాలికపై తండ్రీ, కొడుకుల అత్యాచారం

సారాంశం

హైదరాబాద్ పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై తండ్రి , కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన తండ్రి, కుమారులను అరెస్ట్ చేశారు. 

ఏడేళ్ల బాలికపై తండ్రి , కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొంపల్లికి చెందిన శివకుమార్ (45), అతని కుమారుడు శ్యామెల్ (19)లు గురువారం సాయంత్రం తమ ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న బాలికను గమనించారు. ఆపై సెల్‌ఫోన్ ఇస్తామని ఆశ చూపి వీరిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన తండ్రి, కుమారులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వవరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Liquor prices Hike : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు.. తెలుగు మందుబాబులపై ఇరాన్ వార్ ఎఫెక్ట్..!
Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu