నాగర్ కర్నూల్ లో ఉద్రిక్తత.. రైతుల మూకుమ్మడి ఆత్మహత్యాయత్నం

Published : Feb 17, 2020, 02:21 PM IST
నాగర్ కర్నూల్ లో ఉద్రిక్తత.. రైతుల మూకుమ్మడి ఆత్మహత్యాయత్నం

సారాంశం

చేతిలో కిరోసిన్ డబ్బాలు పట్టుకొని వచ్చి మరీ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కారు. తమ భూమిని కొందరు కబ్జా చేస్తూ.. పైగా తమనే బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ.. వారు ఈ దారుణానికి ప్రయత్నించడం గమనార్హం. ఈ విషయమై ఇప్పటికే తాము చాలా సార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని వాళ్లు పట్టించుకోలేదని వారు వాపోయారు. 

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  రైతులు ముకుమ్మడిగా ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. కలెక్టరేట్ భవనం పైకి ఆత్మహత్యకు యత్నించారు. వారంతా పెంట్లవెల్లి మండలం జట్టుప్రోలు రైతులుగా పోలీసులు గుర్తించారు.

Also Read మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో తప్పిన ప్రమాదం...

చేతిలో కిరోసిన్ డబ్బాలు పట్టుకొని వచ్చి మరీ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కారు. తమ భూమిని కొందరు కబ్జా చేస్తూ.. పైగా తమనే బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ.. వారు ఈ దారుణానికి ప్రయత్నించడం గమనార్హం. ఈ విషయమై ఇప్పటికే తాము చాలా సార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని వాళ్లు పట్టించుకోలేదని వారు వాపోయారు. దాదాపు 12మంది రైతులు బలవన్మరణానికి పాల్పడేందుకు సిద్ధపడ్డారు. కాగా.. పోలీసులు వచ్చి వారి ప్రయత్నాన్ని విరమింపచేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే