తహసీల్దార్ పై డీజిల్ పోసిన రైతు.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ అధికారులు

Published : Jun 30, 2021, 08:53 AM IST
తహసీల్దార్ పై డీజిల్ పోసిన రైతు.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ అధికారులు

సారాంశం

తహసీల్దార్‌ పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ రైతు తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్‌ పోయడం కలకలం రేగింది. 

సరిగ్గా ఓ రెండు సంవత్సరాల క్రితం అనుకుంట...  పని చేయకుండా లంచం కావాలంటూ తిప్పించుకుంటోందని హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విజయారెడ్డిని పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టించింది. అచ్చం అలాంటి సీన్ మళ్లీ రీపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.  

మెదక్‌ జిల్లాలో తహసీల్దార్‌పై ఓ రైతు డీజిల్‌ పోయడం కలకలం రేపింది. శివ్వంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం తాళ్లపల్లి తండాలో మాలోత్‌ బాలు అనే రైతు కరెంట్ షాక్‌తో మృతిచెందాడు.

తహసీల్దార్‌ భానుప్రకాశ్‌ సకాలంలో పట్టా పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. ఈ కారణంగానే మాలోత్‌ బాలుకు బీమా రాలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మంగళవారం గ్రామానికి చెందిన రైతులు మాలోత్‌ బాలు మృతదేహం తీసుకుని శివ్వంపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

అయినప్పటికీ తహసీల్దార్‌ పట్టించుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ రైతు తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్‌ పోయడం కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకుని రైతులకు నచ్చజెపుతున్నారు.  

కాగా.. ఎమ్మార్వో విజయా రెడ్డి ఘటన తర్వాత.. రెవిన్యూ అధికారులు బాగానే షాకయ్యారు.  ఆ ఘటన జరిగి నాటి నుంచి తమకు రక్షణ కల్పించాలని తహసీల్దార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump