కామారెడ్డిలో అమానుషం: ఆస్తులివ్వలేదని ఆసుపత్రిలోనే తల్లి డెడ్‌బాడీ

Published : May 07, 2023, 03:31 PM IST
 కామారెడ్డిలో అమానుషం: ఆస్తులివ్వలేదని   ఆసుపత్రిలోనే  తల్లి డెడ్‌బాడీ

సారాంశం

ఆస్తులు  ఇవ్వలేదని  తల్లి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు  కుటుంబ సభ్యులు  ముందుకు రాలేదు.  కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు  చేసుకుంది.    

కామారెడ్డి: ఆస్తులు ఇవ్వలేదనే  కారణంగా తల్లి డెడ్ బాడీని  ఇంటికి తీసుకెళ్లేందుకు  కుటుంబ సభ్యులు ముందుకు  రాలేదు.కామారెడ్డి  జిల్లాలో ఈ అమానుష ఘటన చోటు  చేసుకుంది.   

కామారెడ్డి  జిల్లాకు  చెందిన కిష్టవ్వకు  70 ఏళ్లు.   ఆమెకు కూతుళ్లున్నారు.  అయితే ఆమెకు  బ్యాంకులో రూ. 1.70 లక్షల నగదు ఉంది. మరో వైపు ఆస్తులు కూడా  ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఆస్తులకు  కిష్టవ్వ బంధువు  నామినీగా  ఉన్నాడు.

అయితే  ఏప్రిల్  21న  కిష్టవ్వ అనారోగ్యంతో  చికిత్స కోసం  కామారెడ్డి ఆసుపత్రిలో  చేరింది.   ఈ విషయం తెలుసుకున్న కూతుళ్లు  ఆసుపత్రికి వచ్చారు. ఆస్తులు  ఇవ్వాలని కిష్టవ్వపై ఒత్తిడి తెచ్చారు. అయితే  ఆస్తులు ఇచ్చేందుకు  ఆమె నిరాకరించింది. దీంతో ఆసుపత్రిలోనే కిష్టవ్వపై  కుటుంబ సభ్యులు దాడి  చేశారని  ప్రచారం సాగుతుంది.  చికిత్స పొందుతూ  ఆసుపత్రిలోనే  ఈ నెల  6వ తేదీ రాత్రి కిష్టవ్వ మృతి చెందింది.  అయితే  ఈ విషయం  కుటుంబ సభ్యులకు వైద్యులు  సమాచారం ఇచ్చారు.  ఆస్తులు  ఇవ్వలేదని   కిష్టవ్వ డెడ్ బాడీ తీసుకెళ్లేందుకు  కుటుంబ సభ్యులు ముందుకు  రాలేదు.  దీంతో  కిష్టవ్వ డెడ్ బాడీని మార్చురీలోనే భద్రపర్చారు  వైద్యులు.

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.