కేసీఆర్ నన్ను మెడపట్టి గెంటేశారు.. బొడిగె శోభ

By ramya neerukondaFirst Published Nov 15, 2018, 9:55 AM IST
Highlights

దళితబిడ్డనైన తనను కేసీఆర్ మెడ పట్టి గెంటివేశారని వ్యాఖ్యానించారు. తన తడాఖా ఎంటో ఎన్నికల్లో చూపిస్తానని సవాల్ విసిరారు. 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనని మెడపెట్టి బయటకు గెంటేశారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ టికెట్ ని కేసీఆర్ వేరేవ్యక్తికి కేటాయించారు.

దీంతో తీవ్ర ఆవేదనకు గురైన శోభ.. పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దళితబిడ్డనైన తనను కేసీఆర్ మెడ పట్టి గెంటివేశారని వ్యాఖ్యానించారు. తన తడాఖా ఎంటో ఎన్నికల్లో చూపిస్తానని సవాల్ విసిరారు. 

కేసీఆర్‌ కుటుంబపాలనపై యుద్దం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదని..అగ్రవర్ణాలకే పెద్దపీట అని విమర్శించారు. ఈ రోజు బీజేపీలో చేరుతున్నానని..అన్ని వివరాలు తర్వాత చెబుతానని బొడిగె శోభ పేర్కొన్నారు.

click me!