రేపే పోలింగ్... పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్

Published : Apr 10, 2019, 09:42 AM IST
రేపే పోలింగ్... పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్

సారాంశం

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రేపే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులంతా.. సొంతూళ్లకు పయనమయ్యారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రేపే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులంతా.. సొంతూళ్లకు పయనమయ్యారు. ఏపీ వైపు వెళ్లే రహదారులపై ఎక్కడ చూసినా కూడా వాహనాలే కనిపిస్తున్నాయి. 

ఎన్నికల నేపథ్యంలో ఏపీవాసులు తమ సొంతూళ్లకు పయనమవుతుండడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామైంది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. 

దీంతో టోల్ ప్లాజా వద్ద కనిపించనంత దూరం వాహనాలు కనిపిస్తుండడంతో రహదారులు ఎక్కడ చూసినా కూడా వాహనాలతో బారులు తీరి దర్శనిమిస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu
Summer Heat : ఏంటిది సూరీడూ.. తెలుగు నేలపై 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలా..! ఆలిండియా రికార్డులు బద్దలవుతాయా..?