ఈఎస్ఐ స్కామ్: నాయిని అల్లుడు, మాజీ పీఎస్ ఇళ్లలో ఈడి తనిఖీలు

Published : Apr 10, 2021, 11:16 AM IST
ఈఎస్ఐ స్కామ్: నాయిని అల్లుడు, మాజీ పీఎస్ ఇళ్లలో ఈడి తనిఖీలు

సారాంశం

ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంలో మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అలుడి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. నాయిని వ్యక్తిగత కార్యదర్శి నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ మాజీ హోం మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేస్తోంది. నాయిని నర్సింహారెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ముకుంద రెడ్డి నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. 

ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఈడి హైదరాబాదులో పది చోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది. దేవికారాణి నివాసంలోనే కాకుండా పలువురి నివాసాల్లో ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని నాచారం, తదితర పది ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే