దుబాయ్ వెళ్లే విమానం హైజాక్.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు మెయిల్..

Published : Oct 09, 2023, 07:43 AM IST
దుబాయ్ వెళ్లే విమానం హైజాక్.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు మెయిల్..

సారాంశం

దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది విమానాన్ని రద్దు చేశారు. 

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ నుంచి దుబాయ్ కి వెళ్లే విమానం హైజాక్ చేయబోతున్నట్లు ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది దుబాయ్ వెళ్లే విమానంలో తనిఖీలు చేపట్టారు. 

మెయిల్ వచ్చి ఐపీ అడ్రస్ ను టెక్నికల్ టీం  ఆరా తీస్తుంది. దుబాయ్ దుబాయ్ వెళ్ళే విమానం రద్దు చేశారు. ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu