సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్ ధర ఎంతో తెలుసా? పూర్తి వివ‌రాలు మీకోసం

Published : Apr 08, 2023, 02:11 PM IST
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ టిక్కెట్ ధర ఎంతో తెలుసా?  పూర్తి వివ‌రాలు మీకోసం

సారాంశం

Hyderabad: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రైలులోని ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ క్యారేజ్‌లో 530 సీట్లు అందుబాటులో ఉన్నాయి.   

Secunderabad to Tirupati Vande Bharat Express Ticket Price: సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వ‌చ్చింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్  ను ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రైలులోని ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ క్యారేజ్‌లో 530 సీట్లు అందుబాటులో ఉన్నాయి.  అయితే, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు న‌డిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్టు ధ‌ర‌లు, రైలు బ‌య‌లుదేరే వివరాల‌ను రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు వెల్ల‌డించారు. 

శుక్రవారం నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 9న తిరుపతిలో, 10న సికింద్రాబాద్ లో రెగ్యులర్ రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. రైలులోని ఏడు ఎసి చైర్ కార్ కోచ్ లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ క్యారేజీలో 530 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రత్యేకమైన పూర్తిగా ఎసి రిజర్వ్డ్ సిట్టింగ్ స్థలాన్ని కలిగి ఉంది. ఈ రెండు స్టేషన్ల మధ్య వేగవంతమైన ప్రయాణ ఎంపికల‌ను ఈ రైలు అందిస్తుంద‌ని అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్టు ధరలు జీఎస్టీ, త‌త్కాల్ స‌ర్ చార్జీల‌తో కలిపి రూ.1,150 నుంచి ప్రారంభమవుతుందని అధికారిక సమాచారం. భారతీయ రైల్వే చివరికి ఖచ్చితమైన ఛార్జీల వివ‌రాల‌ను అందిస్తుంద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఏసీ చైర్ కార్ క్యారేజీలోని సీట్ ధ‌ర క్యాట‌రింగ్ క‌లుపుకుని రూ.1680 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధ‌ర‌లు రూ.3080 లుగా ఉన్నాయి. 

ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7.19 గంటలకు నల్లగొండకు, 9.45 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. ఉదయం 11.09 గంటలకు రైలు ఒంగోలు చేరుకుంటుంది.  11.29 గంట‌ల‌కు నెల్లూరు చేరుకుంటుంది. 2.30 నిమిషాల‌కు తిరుప‌తి చేరుకుంటుంద‌ని రైల్వే శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Prices : నిమ్మ ధర వింటే వామ్మో అనాల్సిందే... హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంత?
CM Revanth Reddy Ramp Walk At Nakirekal Meeting | Asianet News Telugu