వీడు కన్నతండ్రేనా?: కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం

Published : Mar 29, 2021, 07:04 AM IST
వీడు కన్నతండ్రేనా?: కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం

సారాంశం

తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. దాంతో బాలిక గర్భం దాల్చింది.

నల్లగొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. కన్న తండ్రే తన కూతురిని కాటేశాడు. మూడు నెలలుగా కన్న కూతురిపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో జరిగింది. 

ఓ వ్యక్తి తన కూతురిని డిండిలోని ఓ పాఠశాలలో చదవిస్తున్నాడు. కరోనా కారణంగా పాఠశాలలు మూసేయడంతో బాలిక ఇంటికి వచ్చింది. కాగా, బాలికను తండ్రి బలవంతంగా లోబరుచుకున్నాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. 

ఇటీవల బాలిక అనారోగ్యానికి గురైంది. దాంతో తనకు ఏమీ తెలియనట్లు భార్యతో కలిసి కూతురిని దేవరకొండలోని ఓ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి కూతురిని నిలదీసింది. దీంతో తండ్రి చేసిన ఘాతుకం గురించి తల్లికి చెప్పింది. 

అయితే, ఆ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ తల్లీకూతుళ్లను శనివారం రాత్రి ఇంట్లో బంధించి చితకబాదాడు. తట్టుకోలేక బాలిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం