షాదీ ముబారక్ డబ్బును కాజేసిన సైబర్ కేటుగాళ్లు: లబ్ధిదారుడికి చేరకుండానే గోల్‌మాల్

Siva Kodati |  
Published : Aug 22, 2020, 05:18 PM ISTUpdated : Aug 22, 2020, 05:20 PM IST
షాదీ ముబారక్ డబ్బును కాజేసిన సైబర్ కేటుగాళ్లు: లబ్ధిదారుడికి చేరకుండానే గోల్‌మాల్

సారాంశం

పేదింటి వధువులకు ప్రభుత్వం అందజేస్తున్న షాదీ ముబారక్ సాయాన్ని సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బును కాజేశారు

పేదింటి వధువులకు ప్రభుత్వం అందజేస్తున్న షాదీ ముబారక్ సాయాన్ని సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బును కాజేశారు.

వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 8న షాదీ ముబారక్ డబ్బులు లబ్ధిదారుడికి మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో బండ్లగూడ రెవెన్యూ అధికారులు ఫిబ్రవరి 22న ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.

అయితే లబ్ధిదారుడికి డబ్బు అందకముందే తమిళనాడులోని ఎస్‌బీఐలో ఫిబ్రవరి పదిన లక్ష రూపాయల చెక్‌ను ఎన్‌ క్యాష్ చేశారు కేటుగాళ్లు. ఆలస్యంగా వెలుగుచూసిన  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు