షాదీ ముబారక్ డబ్బును కాజేసిన సైబర్ కేటుగాళ్లు: లబ్ధిదారుడికి చేరకుండానే గోల్‌మాల్

Siva Kodati |  
Published : Aug 22, 2020, 05:18 PM ISTUpdated : Aug 22, 2020, 05:20 PM IST
షాదీ ముబారక్ డబ్బును కాజేసిన సైబర్ కేటుగాళ్లు: లబ్ధిదారుడికి చేరకుండానే గోల్‌మాల్

సారాంశం

పేదింటి వధువులకు ప్రభుత్వం అందజేస్తున్న షాదీ ముబారక్ సాయాన్ని సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బును కాజేశారు

పేదింటి వధువులకు ప్రభుత్వం అందజేస్తున్న షాదీ ముబారక్ సాయాన్ని సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బును కాజేశారు.

వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 8న షాదీ ముబారక్ డబ్బులు లబ్ధిదారుడికి మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో బండ్లగూడ రెవెన్యూ అధికారులు ఫిబ్రవరి 22న ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.

అయితే లబ్ధిదారుడికి డబ్బు అందకముందే తమిళనాడులోని ఎస్‌బీఐలో ఫిబ్రవరి పదిన లక్ష రూపాయల చెక్‌ను ఎన్‌ క్యాష్ చేశారు కేటుగాళ్లు. ఆలస్యంగా వెలుగుచూసిన  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu