షాదీ ముబారక్ డబ్బును కాజేసిన సైబర్ కేటుగాళ్లు: లబ్ధిదారుడికి చేరకుండానే గోల్‌మాల్

Siva Kodati |  
Published : Aug 22, 2020, 05:18 PM ISTUpdated : Aug 22, 2020, 05:20 PM IST
షాదీ ముబారక్ డబ్బును కాజేసిన సైబర్ కేటుగాళ్లు: లబ్ధిదారుడికి చేరకుండానే గోల్‌మాల్

సారాంశం

పేదింటి వధువులకు ప్రభుత్వం అందజేస్తున్న షాదీ ముబారక్ సాయాన్ని సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బును కాజేశారు

పేదింటి వధువులకు ప్రభుత్వం అందజేస్తున్న షాదీ ముబారక్ సాయాన్ని సైతం సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బును కాజేశారు.

వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 8న షాదీ ముబారక్ డబ్బులు లబ్ధిదారుడికి మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో బండ్లగూడ రెవెన్యూ అధికారులు ఫిబ్రవరి 22న ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.

అయితే లబ్ధిదారుడికి డబ్బు అందకముందే తమిళనాడులోని ఎస్‌బీఐలో ఫిబ్రవరి పదిన లక్ష రూపాయల చెక్‌ను ఎన్‌ క్యాష్ చేశారు కేటుగాళ్లు. ఆలస్యంగా వెలుగుచూసిన  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Tirumala : రూ.300 దర్శన టికెట్స్ దొరకలేవా? నెలరోజుల్లోపే ఇదే క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్