సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు కలకలం..

Published : Nov 22, 2022, 01:41 PM IST
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు కలకలం..

సారాంశం

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు పేలడం కలకలం సృష్టించింది. బస్టాండ్‌కు సమీపంలోని పార్కింగ్ స్థలంలో బాంబు పేలుడు శబ్దం వచ్చింది. 

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు పేలడం కలకలం సృష్టించింది. బస్టాండ్‌కు సమీపంలోని పార్కింగ్ స్థలంలో బాంబు పేలుడు శబ్దం వచ్చింది. దీనిపై ఆర్టీసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అయితే బస్టాండ్‌ సమీపంలో ఐదు నాటు బాంబులను పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. నాటు బాంబులు ఉన్న వైపు ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 

అక్కడికి నాటు బాంబులు ఎవరూ తీసుకొచ్చారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Jeevan Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు| Asianet News Telugu
Rain Alert: ఇది క‌దా కూల్ న్యూస్ అంటే.. వ‌చ్చే వారం రోజులు వ‌ర్షాలు, ఎండ నుంచి బిగ్ రిలీఫ్