నిజామాబాదులో కరోనా విజృంభణ: తెలంగాణలో లక్ష దాటిన పాజిటివ్ కేసులు

By telugu teamFirst Published Aug 22, 2020, 9:07 AM IST
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. హైదరాబాదులో మరోసారి ఎక్కువ కేసులు రికార్డయ్యాయి. నిజాామాబాద్ లో కేసులు పెరిగాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. మొత్తం కేసుల సంఖ్య 1 లక్ష 1865కు చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి ఈ జిల్లాలో గత 24 గంటల్లో 153 కరోనా కేసులు రికార్డయ్యాయి. 

అదే విధంగా నల్లగొండ జిల్లాలోనూ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగింది. ఈ జిల్లాలో 122 కేసులు బయటపడ్డాయి. హైదరాబాదులో మరోసారి 400కు పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో గత 24 గంటల్లో 447 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 202 కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో తెలంగాణలో 2474 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 744కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి1768 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 78735కు చేరుకుంది.   

జిల్లాలవారీగా తెలంగాణలో నమోదైన కరోనా వైరస్ కేసుల సంఖ్య

ఆదిలాబాద్ 15
భద్రాద్రి కొత్తగూడెం44
జీహెచ్ఎంసీ 447
జగిత్యాల 91
జనగామ 20
జయశంకర్ భూపాలపల్లి 19
జోగులాంబ గద్వాల 59
కామారెడ్డి 61
కరీంనగర్ 75
ఖమ్మం 125
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 11
మహబూబ్ నగర్ 49
మహబూబాబాద్ 59
మంచిర్యాల 53
మెదక్ 38
మేడ్చెల్ మల్కాజిగిరి 149
ములుగు 15
నాగర్ కర్నూలు 52
నల్లగొండ 122
నారాయణపేట 11
నిర్మల్ 19
నిజామాబాద్ 153
పెద్దపల్లి 79
రాజన్న సిరిసిల్ల 52
రంగారెడ్డి 201
సంగారెడ్డి 72
సిద్ధిపేట 92
సూర్యాపేట 63
వికారాబాద్ 18
వనపర్తి 37
వరంగల్ రూరల్ 22
వరంగల్ అర్బన్ 123
యాదాద్రి భువనగిరి 28
మొత్తం కేసులు 2474

 

Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 22.08.2020) pic.twitter.com/qblGt8lMPA

— Dr G Srinivasa Rao (@drgsrao)
click me!