లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక: పోటీకి కాంగ్రెస్ సై

Published : Apr 20, 2021, 02:13 PM IST
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక: పోటీకి కాంగ్రెస్ సై

సారాంశం

జీహెచ్ఎంసీ పరిధిలోని  లింగోజిగూడ డివిజన్ కు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.  ఇవాళ తమ పార్టీ అభ్యర్ధికి బీ ఫామ్  అందించనుంది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని  లింగోజిగూడ డివిజన్ కు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.  ఇవాళ తమ పార్టీ అభ్యర్ధికి బీ ఫామ్  అందించనుంది.గత ఏడాది డిసెంబర్ మాసంలో జీహెచ్ఎంసీకి  ఎన్నికలు జరిగియి. ఈ ఎన్నికల్లో  లింగోజిగూడ  డివిజన్ నుండి బీజేపీ అభ్యర్ధిగా ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించారు.  ప్రమాణం చేయకముందే  ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో  ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.  

ఈ స్థానం నుండి  పోటీ చేయవద్దని  బీజేపీ నేతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని  బీజేపీ నేతలు  కేటీఆర్ ను కోరారు. ఈ విషయమై కేటీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడ ఇదే విషయమై కోరారు. 

అయితే ఈ స్థానం నుండి పోటీ చేస్తామని మంగళవారం నాడు  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ అనుమతి లేకుండా ఈ విషయమై కేటీఆర్ ను కలవడంపై కొందరు నేతలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం  సీరియస్ అయింది.  ఈ విషయమై  ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీ  రేపటిలోపుగా నివేదిక అందించనుంది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా కొందరు నేతలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu