హైద్రాబాద్‌లో రూ.2,679 కోట్లతో మూడు టిమ్స్ ఆసుపత్రులు: భూమి పూజ చేసిన కేసీఆర్

Published : Apr 26, 2022, 12:03 PM ISTUpdated : Apr 26, 2022, 12:53 PM IST
 హైద్రాబాద్‌లో రూ.2,679 కోట్లతో మూడు టిమ్స్ ఆసుపత్రులు: భూమి పూజ చేసిన కేసీఆర్

సారాంశం

హైద్రాబాద్ లో మూడు ట్విమ్స్ ఆసుపత్రులకు  సీఎం కేసీఆర్ మంగళవారం నాడు భూమి పూజ నిర్వహించారు. సనత్ నగర్, కొత్తపేట, అల్వాల్ లో మూడు ట్విమ్స్ ఆసుపత్రులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR మంగళశారం నాడు హైద్రాబాద్ లో మూడు TIMS  ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. కొత్తపేట, సనత్ నగర్, అల్వాల్ లో మూడు టిమ్స్ ఆసుపత్రలను  నిర్మించనున్నారు. అల్వాల్ లో 28.41 ఎకరాల్లో రూ. 897 కోట్ల వ్యయంతో జీ+ 5 అంతస్థులతో టిమ్స్ Hospital ని నిర్మించనున్నారు. Sanath Nagar లో 17 ఎకరాల్లో రూ. 882 కోట్లతో జీ+ 14  అంతస్తులతో టిమ్స్  భవనాన్ని నిర్మించనున్నారు. గతంలో Kothapetలో ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో రూ.900 కోట్లతో జీ+ 14   అంతస్థులతో టిమ్స్  ను నిర్మించనున్నారు ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేయనున్నారు.  మంగళవారం నాడు అల్వాల్ లో ఈ మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. రూ. 2,679 కోట్లతో ఈ మూడు ఆసుపత్రులను నిర్మించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్