మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ సంతాపం..

Published : Jul 01, 2023, 11:19 AM ISTUpdated : Jul 01, 2023, 11:45 AM IST
మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ సంతాపం..

సారాంశం

మహారాష్ట్రలో ఘోరమైన బస్సు ప్రమాదంలో 25మంది సజీవ దహనం అయిన ఘటన మీద బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ : మహారాష్ట్రలో జరిగిన ఘోర  అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బస్సులో ప్రయాణిస్తున్న పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం పట్ల బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

అయితే దీనిమీద బస్సు ఓనర్ వీరేంద్ర ధర్మ మాట్లాడుతూ.. బస్సు బాగానే ఉందన్నారు. అన్ని పర్మిషన్లు అన్నీ ఉన్నాయి. 2020లో తీసుకున్నాం. లాక్ డౌన్ లో ఒక సంవత్సరం బస్సును నడిపించలేదు. డ్రైవర్ గణేష్ కూడా ఎక్స్ పీరియన్స్ డ్. లాక్ డౌన్ తరువాత నడిపిస్తున్నాం. బస్సు కొత్తది. ఇది కేవలం ప్రమాదం వల్లే జరిగిందన్నారు. 

కాగా, శుక్రవారం ఉదయం మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగడంతో 25మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.నాగ్ పూర్-పూణె హైవే మీద బస్సు వెల్తుండగా.. బస్సు టైర్ పేలడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో బస్సు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

ప్రమాద సయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. గుల్దానా సమీపంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని గుల్దానాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు నాగ్ పూర్ నుంచి ఫూణె వెడుతుండగా ప్రమాదం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

సంగారెడ్డి సభకి సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | Cm Revanth Reddy Mass Entry
గోల్కొండ కోట పై జాతీయ జెండా ఎగరేసిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Hoists National Flag