మహేష్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్యోద్యోగం.. కేసీఆర్

Bukka Sumabala   | Asianet News
Published : Nov 10, 2020, 12:18 PM ISTUpdated : Nov 10, 2020, 12:28 PM IST
మహేష్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్యోద్యోగం.. కేసీఆర్

సారాంశం

సరిహద్దులో జరిగిన కాల్పుల్లో మరణించిన ఆర్మీ జవాన్ మహేష్ మరణానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిగా మహేష్ చరిత్రలో గుర్తుండిపోతాడన్నారు. 

సరిహద్దులో జరిగిన కాల్పుల్లో మరణించిన ఆర్మీ జవాన్ మహేష్ మరణానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిగా మహేష్ చరిత్రలో గుర్తుండిపోతాడన్నారు. 

ప్రభుత్వం మహేష్ కుటుంబాన్ని ఆదుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. మహేష్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, రూ .50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మహేష్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని చెప్పారు. 

ఆర్మీ జవాన్ మహేష్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఈ రోజు నిజామాబాద్ జిల్లా,వెల్పూర్ మండలం కోమన్‌పల్లిలో జరుగుతాయి. సోమవారం, అమరవీరుడికి మంత్రి నివాళులు అర్పించారు. అతని కుటుంబ సభ్యులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పోలీసు కమిషనర్ కార్తికేయతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. 

అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారంతో బీఎస్ఎఫ్, ఆర్మీ దళాలు జమ్మూ కాశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లో సోదాలు జరుపుతున్న సమయంలో ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మహేష్ ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

July Holidays : ఈ వీక్ ఇంకో రెండ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్, నాల్రోజులు సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?
షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ లవ్ స్టోరీ.. "ఏ మాయ చేశావే'' సినిమా స్టైల్లో ఉందిగా..!