రైతుల భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నారు: భట్టీ విక్రమార్క విమర్శలు

Siva Kodati |  
Published : Sep 20, 2020, 03:25 PM IST
రైతుల భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నారు: భట్టీ విక్రమార్క విమర్శలు

సారాంశం

కుర్ముద్దిలో ఫార్మా భూములు కోల్పోతున్న రైతులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద రైతుల భూములను కోటీ యాభై లక్షల  రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.

కుర్ముద్దిలో ఫార్మా భూములు కోల్పోతున్న రైతులతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద రైతుల భూములను కోటీ యాభై లక్షల  రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఆ కోటీన్నరకు అసలు హక్కుదారుడు రైతేనని విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యవహారంపై బాధితులంతా ప్రశ్నించాల్సిన అవసరం వుందన్నారు. ఈ సమస్య ఇక్కడి రైతులొక్కరిదే కాదన్న భట్టీ.. ఫార్మా కంపెనీ పెట్టిన తర్వాత ఇక్కడ కాలుష్యం పెరిగిపోతుందన్నారు.

వర్షపు నీటి ద్వారా ఈ ప్రాంతంలోని కాలుష్యమంతా మైళ్ల దూరంలోని కృష్ణానదికి చేరి రాష్ట్రం మొత్తం వ్యాపిస్తుందని విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే రాష్ట్రం మొత్తాన్ని కదిలిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త‌.. అంత‌లోనే దారుణ సంఘ‌ట‌న
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..