మిర్యాలగూడ కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. పార్టీ కార్యాలయంలోనే బాహాబాహీ

Siva Kodati |  
Published : Feb 06, 2023, 03:35 PM IST
మిర్యాలగూడ కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. పార్టీ కార్యాలయంలోనే బాహాబాహీ

సారాంశం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ వర్గీయులు దాడి చేసుకున్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ వర్గీయులు దాడి చేసుకున్నారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించి తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారని డీసీసీ ప్రెసిడెంట్‌ను నిలదీశారు. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు ఇరువర్గాల కార్యకర్తలు. అనంతరం వన్‌టౌన్ పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఇంకో మూడ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్... తర్వాత వరుస సెలవులే, బ్యాక్ టు బ్యాక్ లాంగ్ వీకెండ్స్
Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్... ఇక్కడ ఒక్క ఎకరం రూ.250 కోట్లా..!