గుర్రంపోడు: బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Feb 07, 2021, 05:41 PM ISTUpdated : Feb 07, 2021, 06:20 PM IST
గుర్రంపోడు: బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ, ఉద్రిక్తత

సారాంశం

నల్గొండ జిల్లా గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 540 సర్వే నెంబర్‌లోని వివాదాస్పద భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

నల్గొండ జిల్లా గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 540 సర్వే నెంబర్‌లోని వివాదాస్పద భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు అక్కడికి వెళ్లారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గిరిజనుల భూములను ఆక్రమించారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంతో గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లదాడికి దిగాయి.

అక్కడే వున్న షెడ్డును ఇరు వర్గాలు ధ్వంసం చేశాయి. ఇప్పటికే గుర్రంపోడుకు బండి సంజయ్, విజయశాంతి చేరుకున్నారు. తొలుత గిరిజనులను భూముల్లోకి రాకుండా రవీందర్ రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బీజేపీ కార్యకర్తలను నిలువరించేందుకు గాను పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అయితే రాళ్లదాడిలో సీఐకి గాయాలయ్యాయి

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే